తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 2,319 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 7,00,094కి చేరింది. ఈ మహమ్మారి ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మృతుల సంఖ్య 4,047కి చేరింది. కొత్తగా ఈ వైరస్ నుంచి 474 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 6,77,708 మంది రికవరీ అయ్యారు.
అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 96.80 శాతం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,339 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ రోజు 1,275 కేసులు ఒక్క హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. దీంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు అవుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం అయింది.
టీనేజర్లకు మొదటి డోసుతో పాటు.. ఫ్రంట్ లైన్ వారియర్స్, వృద్దులకు బూస్టర్ డోసులు అందిస్తున్నారు. ఒక్కరోజే రాష్ట్రంలో 2.51 లక్షల మందికి కొవిడ్ టీకాలు అందించారు. 36,691 మందికి కొవిడ్ బూస్టర్ డోసులు పంపిణీ చేశారు. ప్రభుత్వం మాస్కులు, సామాజిక దూరం తప్పని సరిచేసింది. కరోనా నిబంధనలు పెంచడం వలన రికవరీ గణనీయంగా కనిపిస్తోందని.. జాగ్రత్తగా ఉంటే కొత్త కేసులు తగ్గడంతో పాటు రికవరీ రేటు కూడా ఆశించదగ్గ స్థాయిలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.