• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » తెలంగాణ కొత్త సీఎస్ ఈమే.. ఇప్పటిదాకా ఏం చేశారంటే..?

తెలంగాణ కొత్త సీఎస్ ఈమే.. ఇప్పటిదాకా ఏం చేశారంటే..?

Last Updated: January 11, 2023 at 4:12 pm

సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాల్సి రావడంతో.. తెలంగాణకు కొత్త సీఎస్ ను నియమించాల్సి వచ్చింది. తెరపైకి అనేక పేర్లు వచ్చినా.. శాంతికుమారినే కేసీఆర్ నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కలిశారు శాంతికుమారి. ఈ సందర్భంగా సీఎం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతికుమారి 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు నిర్వహించారు. సీఎంవోలో స్పెషల్ ఛేజింగ్ సెల్ కూడా చేశారు.

తొలిసారి తెలుగు, మహిళా అధికారికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ వెల్ఫేర్ కమిషనర్ గా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సీఎంవోలో కీలక పాత్ర పోషించారు శాంతి కుమారి. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్‌ గా కూడా పనిచేశారు. 2025 ఏప్రిల్ వరకు ఈమె పదవీకాలం ఉండనుంది.

సీఎస్ నియామకం విషయంలో చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. రాష్ట్ర క్యాడర్‌ లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వసుధా మిశ్రా, రాణి కుమిదిని, శశాంక్‌ గోయల్‌, సునీల్‌ శర్మ, రజత్‌ కుమార్‌, రామకృష్ణారావు, అరవింద్ కుమార్‌ ఉన్నారు. వీరిలో వసుధా మిశ్రా, శశాంక్‌ గోయల్‌, అశోక్‌ కుమార్‌ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. రాణి కుమిదిని కార్మికశాఖ బాధ్యతల్లో ఉన్నారు. సునీల్‌ శర్మ ఇంధనశాఖ, రజత్‌ కుమార్‌ నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణారావు ఆర్థికశాఖ, అరవింద్ కుమార్‌ పురపాలకశాఖ బాధ్యతల్లో ఉన్నారు. అయితే.. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారిని నియమించింది ప్రభుత్వం.

Primary Sidebar

తాజా వార్తలు

అయోధ్య రాముడి విగ్రహం కోసం నేపాల్ శాలిగ్రామ శిలలు

రేపటి నుంచి ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

జమ్ములో భారీగా హిమపాతం..స్తంభించిన జనజీవనం..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

ఆటోనగర్‌ టైర్ల గోడౌన్‌ లో మంటలు!

టీడీపీ నేత పై కాల్పులు.. ప్రత్యర్థుల పనే!

నగరంలో మరో అగ్ని ప్రమాదం!

ఇన్వెస్టర్లకు సొమ్ములు తిరిగిచ్చేస్తాం .. అదానీ గ్రూప్

కీవీస్ ను చిత్తుగా ఓడించి టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భారత్..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

ఫిల్మ్ నగర్

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి... !!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి… !!

‘భారతీయుడు 2’ షూటింగ్ కి చాపర్ లో వస్తున్న కమల్

‘భారతీయుడు 2’ షూటింగ్ కి చాపర్ లో వస్తున్న కమల్

కూతురిని భుజాన ఎత్తుకుని..!

కూతురిని భుజాన ఎత్తుకుని..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap