మార్చి 10న హైదరాబాద్ లో తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ బచావో సదస్సు పోస్టర్ ను గన్ పార్క్ లో వీజేఎస్ నేతలతో కలిసి వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కేసీఆర్ ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన 1200 మంది అమర వీరుల కుటుంబాలకు ఆదుకోకుండా 500 మందిని గుర్తించి మిగతా వారికి నిర్లక్ష్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మిగిలిన అమర వీరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదని విద్యార్థుల వీరోచిత పోరాటం, ఆత్మ బలిదానాలు, ప్రొఫెసర్ కోదండరాo గారి నాయకత్వంలో తెలంగాణ సకల జనుల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రo సాకారం అయ్యిందని ఆయన వివరించారు.
నాటి ఉద్యమ ఆకాంక్షలు మరచిన కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటానికి తెలంగాణ ఉద్యమకారులు పార్టీ జెండాలను పక్కన పెట్టి ఏకం అయ్యి తెలంగాణను కేసీఆర్ కబంద హాస్తాల నుండి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా టీజేఎస్ నిర్వహించే సదస్సుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వీజేఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నరేందర్ నకిరేకంటి, వీజేఎస్ రాష్ట్ర నాయకులు నేత్ర, అమిత్, వ్యాస్, మనోజ్, అంజి, హరీష్, గుణిషా, ప్రదీప్, ఉదయ్, మోహన్, సాయిరాం, కృష్ణా తదితరులు పాల్గొన్నారు.