తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క్వారంటైన్ ముఖ్యమంత్రిని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పేదలు ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో నుంచి బయటకు రాడు. జోకర్ ముఖ్యమంత్రి క్వారంటైన్ ముఖ్యమంత్రి పేరు కరెక్ట్ గా కేసీఆర్ కి సెట్ అవుతుంది. ప్రజలను, రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుంది. కోటి టన్నుల ధాన్యం సేకరిస్తా అన్నా సీఎం ఇప్పటి వరకు 20 టన్నుల ధాన్యం మాత్రమే సేకరించాడు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అగ్రికల్చర్ బులిటెన్ విడుదల చేస్తున్నాయి. మరి తెలంగాణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో 18 రాష్ట్రాల ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి.
సీఎం మీడియా సమావేశం పై ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు చేస్తుంటే సీఎం స్వీకరించడం లేదు. రాబోయే రోజుల్లో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానికి సరైన విధివిధానాలు లేవు. పంట కొనుగోళ్ల కోసం బోర్డులను ఏర్పాటు చేసి వెళ్లాలికాని వెళ్లడం లేదు. కమిషన్ కోసం ప్రభుత్వం కక్కుర్తి పడుతుంది. దళారుల రాజ్యం నడుస్తోంది. సీఎం కేసీఆర్ కి దమ్ము దైర్యం ఉంటే కొనుగోళ్ల కేంద్రాలలో పర్యటన చేయాలి.
కేసీఆర్ కేబినెట్ లో ఒక్కో మంత్రి ఒక్కో మాట మాట్లాడుతారు. 464 కోట్లు కేంద్రం గిడ్డంగుల నిర్మాణం కోసం ఇచ్చింది. 22 లక్షల టన్నుల ధాన్యం వాటి వల్ల స్టోరేజ్ చేయొచ్చు. రైతుల పంటను నిల్వ చేసేందుకు ఎన్ని ఫంక్షన్ హాల్స్ బుక్ చేశారో చెప్పాలి.మంచి జరుగుతే కేసీఆర్ పేరు… చెడు జరుగుతే కేంద్రం పై నెట్టేయడం అలవాటు అయింది. వైద్యులకు టెస్టులు జరపండి అని వేడుకున్నా సీఎం పట్టించుకోవడం లేదు. ప్రజల ప్రాణాలను కోరుకుంటుంది కేసీఆర్ అని అన్నారు సంజయ్. సీఎం నిర్ణయాల వల్ల నిన్న మళ్ళీ హైదరాబాద్ లో కేసులు పెరిగాయి. టెస్టులు జరపాలి అని కేంద్రం అంటుంటే కేసీఆర్ మాత్రం తన పేరు కోసం టెస్టులను తగ్గించారు. గత నెల 24 నుంచి 28వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన నివేదికలో 26 ఉంటే.. రాష్ట్ర నివేదికలో 25 మాత్రమే ఉన్నాయి. ఏప్రిల్ 26వ తేదీన కరోనా రోగి మరణిస్తే జిఎచ్ఎంసి ఆయన దహన కార్యక్రమం చేసింది. మందు బాబులు కేసీఆర్ కి సన్మానించారు. ఎన్ 95 మాస్కలు 1లక్ష 62వేలు, పీపీఈ కిట్స్ 66వేలు కేంద్రం ఇచ్చింది. కేంద్రం టెస్టుల కోసం లాబ్ లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉపయోగిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. విమర్శలకు ప్రతివిమర్శలు సమాధానం కాదు. పాత బస్తీలో దళిత యువతి పై అత్యాచారం చేయడం దురదృష్టకరం. ప్రభుత్వం ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దొంగలకు అడ్డాగా మారుస్తున్న ఎంఐఎం కి టీఆరెస్ పార్టీ మద్దతు ప్రకటించడం బాధాకరం. దళిత మహిళ పై అసభ్యకరంగా వ్యవహరించినదుకు కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.