రాష్ట్ర కేబినెట్ ఈ నెల5న సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలిపేందుకు కేబినెట్ భేటీ కానుంది. ప్రగతి భవన్లో సీఎం అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మంత్రులందరూ సమావేశానికి హాజరుకానున్నారు.

సమావేశంలో బడ్జెట్కు ఆమోదంతో తెలపడంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ నాందేడ్ పర్యటకు వెళతారని తెలుస్తోంది.
ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి రేపు మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు.
అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సంఘం భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.