• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

కనిపిస్తే కాల్చివేత దాకా తెచుకోవద్దు- ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక

Published on : March 24, 2020 at 9:05 pm

కరోనా విజృంభన తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలని..షూట్ ఎట్ సైట్ వంటి దారుణ పరిస్థితులను కొనితెచుకోవద్దని హెచ్చరించారు సీఎం కేసీఆర్. కరోనా కట్టడికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోన్న ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడంలేదని ఆయన మాటల్లో కొటొచ్చినట్లు కనిపించింది. మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ… ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలంటూ పదేపదే విజ్ఞప్తి చేయడం సమస్య తీవ్రతను కళ్ళకు కట్టింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరు బయటకు రావొద్దని…అనవసరంగా బయటకు వచ్చి వ్యాధి తీవ్రతను మరింత పెంచవద్దని కేసీఆర్ కోరారు. కరోనా కట్టడి విషయంలో భారత్ ఇంకా భేష్ అని..అమెరికా వంటి అగ్రదేశాల్లో పరిస్థితి చేయి దాటిపోయిందని…అక్కడ ఆర్మీ ని రంగంలోకి దించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. కనుక ఇక్కడ కూడా అలాంటి పరిస్థితిని తెచుకోవద్దని ఆయన ప్రజలను కోరారు.

కరోనా నివారణ విషయంలో అవహగన కల్పించకుండా ఇంటికే పరిమితం అయిన ప్రజాప్రతినిధులకు కేసీఆర్ తన వ్యాఖ్యలతో వాతలు పెట్టారు.ఖచ్చితంగా బుధవారం నుంచి పోలీసులతో సమన్వయం చేసుకుంటూ రోడ్డు ఎక్కాల్సిందేనని ఆదేశించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని ఎన్నుకొన్న ప్రజల ఆరోగ్య భద్రతల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు. వార్డు మెంబర్ నుంచి సీఎం స్థాయి వరకు అంతా రేపటి నుంచి కరోనా నివారణ విషయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

ఇక, సందు దొరికింది కదా అని బ్లాక్ మార్కెట్ దందా స్టార్ట్ చేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని ఈమేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.నిత్యావసర సరుకులు, కూరగాయలు నిర్ణయించిన రేట్లకే అమ్మాలని లేదంటే జైలుకు వెళ్లడం తప్పనిసరి అని హెచ్చరించారు. ఈమేరకు ప్రజాప్రతినిధులు కూడా కూరగాయల ధరలను పర్యవేక్షించాలని తెలిపారు. పరిస్థితి చేయి దాటకముందే జాగ్రత్త పడదమంటూ సూచించారు.

సాయంత్రం 6 తరువాత షాపులు ఎట్టి పరిస్థితుల్లో తెరవొద్దని… అలా చేస్తే వారి లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. రైతులు సాగు చేసిన పంటను గ్రామాల్లోనే కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు. ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను తుచ పాటించాలని.. ప్రభుత్వ సూచనలు పాటించకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వస్తాయని… అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని… ఆర్మీని రంగంలోకి దించాల్సిన పరిస్థితిని తెచుకోవద్దని కేసీఆర్ కోరారు.

tolivelugu app download

Filed Under: బిగ్ స్టోరీ, వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇదే ?

పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇదే ?

దిల్ రాజు పై నాని గరం గరం ?

దిల్ రాజు పై నాని గరం గరం ?

తాండ‌వ్ నిర్మాత‌ల‌కు సుప్రీం షాక్

తాండ‌వ్ నిర్మాత‌ల‌కు సుప్రీం షాక్

ఇక ఆ సీన్ లకు కూడా లావణ్య ఓకే చెప్పినట్టేనా ?

ఇక ఆ సీన్ లకు కూడా లావణ్య ఓకే చెప్పినట్టేనా ?

పూజా హెగ్డే కి అంత డిమాండ్ ఎందుకో ?

పూజా హెగ్డే కి అంత డిమాండ్ ఎందుకో ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఏపీలో త‌గ్గిన క‌రోనా టెస్టులు- కేసులు

ఏపీలో త‌గ్గిన క‌రోనా టెస్టులు- కేసులు

H1B వీసాదారుల‌కు కొత్త అధ్య‌క్షుడు గుడ్ న్యూస్

H1B వీసాదారుల‌కు కొత్త అధ్య‌క్షుడు గుడ్ న్యూస్

supreme court deadline to bjp govt over floor test in maharashtra

ఢిల్లీ రైతు సంఘాల్లో చీలిక‌

telangana secrateriat

పీఆర్సీపై సీఎంతోనే తేల్చుకుంటాం- ఉద్యోగ సంఘాలు

father mother

మ‌ద‌న‌ప‌ల్లె కూతుళ్ల హ‌త్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు

రైత‌న్న పార్ల‌మెంట్ ర్యాలీ వాయిదా...?

రైత‌న్న పార్ల‌మెంట్ ర్యాలీ వాయిదా…?

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)