గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటూ సంక్షేమ పథకాల పేరుతో అరచేతిలో స్వర్గం చూపించిన కేసిఆర్ గారు… స్కీముల పేరుతో స్కాములు చేసి…తెలంగాణ రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్ల అప్పులతో ముంచేశారు. ఈ వాస్తవాలను అడిగితే…ఈ పాపం కేంద్రంలోని మోడీ ప్రభుత్వానిది.. గతంలో పాలించిన కాంగ్రెస్ దే అంటూ.. గులాబీ బాస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్..బిజెపిల వంటి జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని చెప్పిన కేసీఆర్ గారు… మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎందుకు 7 సీట్లలో ఓడిపోయింది అని ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికే మూడు లక్షల కోట్ల భారాన్ని మోయలేక తెలంగాణ ఆర్థిక శాఖ సతమతమవుతుంటే… తెలంగాణలో లో కాంగ్రెస్ తో పాటు బిజెపిని గల్లంతు చేసేందుకు మరో మూడు స్కీములు తన అమ్ముల పొదిలో ఉన్నాయని కెసిఆర్ గారు చేసిన ప్రకటన చూసి నవ్వాలో? ఏడవాలో? తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు. మిషన్ కాకతీయ… మిషన్ భగీరథ.. కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన కేసీఆర్ గారు… కొత్తగా ప్రకటించబోతున్న స్కీమ్ లకు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తారో? స్కీములు అమలుచేసే పేరుతో ఎన్ని కోట్ల స్కాం లకు పాల్పడతారో ఎవరికీ అంతుబట్టడం లేదు. కెసిఆర్ కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటి పేర్లతో గనక మళ్లీ అప్పులు చేయడం మొదలుపెడితే కాంగ్రెస్ బిజెపిల మాట ఏమో కానీ అప్పుల బాధ తట్టుకోలేక ఈసారి తెలంగాణ ప్రజలు గల్లంతై పోయే ప్రమాదం ఉంది.కెసిఆర్ గారి వాలకాన్ని చూస్తూ ఉంటే.. పథకాల పేరుతో ఆయన చేస్తున్న ఖర్చులు… వాటి కారణంగా పెరుగుతున్న అప్పులను తీర్చేందుకు.. చివరకు మోడీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకోవాలేమో?స్కాంలతో ఖజానా ఖాళీ…
స్కీమ్ ల పేరుతో వైకుంఠపాళి
……………………………………
గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటూ సంక్షేమ పథకాల పేరుతో అరచేతిలో స్వర్గం చూపించిన కేసిఆర్ గారు… స్కీముల పేరుతో స్కాములు చేసి…తెలంగాణ రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్ల అప్పులతో ముంచేశారు. ఈ వాస్తవాలను అడిగితే…ఈ పాపం కేంద్రంలోని మోడీ ప్రభుత్వానిది.. గతంలో పాలించిన కాంగ్రెస్ దే అంటూ.. గులాబీ బాస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్..బిజెపిల వంటి జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని చెప్పిన కేసీఆర్ గారు… మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ అవే జాతీయ పార్టీల చేతులో ఎందుకు 7 సీట్లలో ఓడిపోయింది అని ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికే మూడు లక్షల కోట్ల భారాన్ని మోయలేక తెలంగాణ ఆర్థిక శాఖ సతమతమవుతుంటే… తెలంగాణలో లో కాంగ్రెస్ తో పాటు బిజెపిని గల్లంతు చేసేందుకు మరో మూడు స్కీములు తన అమ్ముల పొదిలో ఉన్నాయని కెసిఆర్ గారు చేసిన ప్రకటన చూసి నవ్వాలో? ఏడవాలో? తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు. మిషన్ కాకతీయ… మిషన్ భగీరథ.. కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన కేసీఆర్ గారు… కొత్తగా ప్రకటించబోతున్న స్కీమ్ లకు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తారో? స్కీములు అమలుచేసే పేరుతో ఎన్ని కోట్ల స్కాం లకు పాల్పడతారో ఎవరికీ అంతుబట్టడం లేదు. కెసిఆర్ కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటి పేర్లతో గనక మళ్లీ అప్పులు చేయడం మొదలుపెడితే కాంగ్రెస్ బిజెపిల మాట ఏమో కానీ అప్పుల బాధ తట్టుకోలేక ఈసారి తెలంగాణ ప్రజలు గల్లంతై పోయే ప్రమాదం ఉంది.కెసిఆర్ గారి వాలకాన్ని చూస్తూ ఉంటే.. పథకాల పేరుతో ఆయన చేస్తున్న ఖర్చులు… వాటి కారణంగా పెరుగుతున్న అప్పులను తీర్చేందుకు.. చివరకు మోడీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకోవాలేమో?