స్టాఫ్ నర్స్ నియామక ప్రక్రియలో తమకు న్యాయం చేయాలని కాంట్రాక్టు నర్సులు మరోసారి డీహెచ్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. 2017లో విడుదలైన నోటిఫికేషన్ లో తమకు న్యాయంగా దక్కాల్సిన వెయిటేజ్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. కాంట్రాక్టు నర్సులకు ప్రత్యేక వెయిటేజీ కింద 20 మార్కులు కలుపుతామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చి, నోటిఫికేషన్ లో మాత్రం పట్టించుకోలేదు.
గతేడాది ఎంపికైనా వారి జాబితా విడుదలయ్యింది. కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేసినట్లు తప్పుడు ధ్రువపత్రాలలో వెయిటేజీ పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేసిన సర్కారు….. ఇటీవల తాజాగా వెయిటేజీ మార్కులను జత చేసిన జాబితాను విడుదల చేసింది. ఈనెల చివరి వారంలో నియామకాలను పూర్తి చేసేందుకు టీఎస్పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికీ తమకు వెయిటేజీ మార్కులు రాలేదంటూ పలువురు డీహెచ్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు నర్సులు ఆందోళనకు దిగారు.