తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. మార్చి 3 నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుంది. ఆన్ లైన్ లో అప్లికేషన్ స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 10గా నిర్ణయించారు. ఏప్రిల్ 12 నుండి 14వ తేదీవరకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది.
రూ.250 లేట్ ఫీజుతో ఏప్రిల్ 15 వరకు, రూ.500 లేటు ఫీజుతో ఏప్రిల్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. రూ.2500 లేటు ఫీజు ఏప్రిల్ 25 వరకు, రూ.5000 లేటు ఫీజుతో మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 30 నుండి ఆన్ లైన్ లో ఎంసెట్ హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. మే 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష జరగనుంది.
ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు రూ.500 కాగా, ఇతర విద్యార్థులకు రూ.900 నిర్ణయించారు.