ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31 తో ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి ఇచ్చిన అప్పులో మిగిలి ఉన్న నగదుకు బాండ్లు జారీ చేసింది. దీంతో మొత్తం డబ్బు పూర్తవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రుణంగా తీసుకోవాల్సిన నగదును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
అయితే ఒక రాష్ట్రానికి సంవత్సర కాలంలో రాష్ట్ర పెట్టుబడులు, ఆదాయాలు తదితర అంశాలు దృష్టిలో పెట్టుకొని రుణంగా డబ్బులు ఇస్తుంది. ఈ నగదును ఆర్బీఐ ద్వారా రాష్ట్రాలు సంవత్సరంలోనే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుగుతుంది. కేంద్రం నుంచి వచ్చిన నిధుల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాల్లో కొన్ని అంశాల్లో కేటాయింపులు జరుగుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాల మొత్తం పూర్తయ్యాయి.
అయితే రుణ పరిమితికి లోబడి ఈ ఏడాది ఇప్పటికే 37 వేల కోట్లు అప్పుగా తీసుకోగా.. మిగిలిన 650 కోట్ల కోసం ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. వచ్చే ఏడాది 46 వేల కోట్లు రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మరో 650 కోట్లు రుణంగా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
రిజర్వ బ్యాంక్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు జారీ చేసింది. తొమ్మిదేళ్ల కాలానికి జారీ చేసిన బాండ్లను ఆర్బీఐ మంగళవారం వేలం వేయనుంది. ఆ తర్వాత 650 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరనున్నాయి. వాటిని కలుపుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ ఆర్ బీఎం పరిధిలోకి లోబడి తీసుకునే రుణం మొత్తం పూర్తవుతుంది.