ఆన్ లైన్ లో యాప్స్ ద్వారా రుణాలు ఇస్తూ, భారీగా వడ్డీలు వసూలు చేయటంతో పాటు వేధిస్తూ పలువురి మృతికి కారణమవుతున్న యాప్స్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. రుణ యాప్ లను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రుణ యాప్ లను వెంటనే ప్లేస్టోర్ నుండి తొలగించేందుకు వెంటనే సంప్రదింపులు చేపట్టాలని, యాప్ నిర్వాహకులను కట్టడి చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. చైనా రుణ యాప్ వల్ల బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని న్యాయవాది కళ్యాణ్ దీప్ వేసిన పిల్ పై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారించింది. మొత్తం అంశంపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు కూడా నివేదికలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశిస్తూ… రుణ యాప్ లపై విచారణ మార్చి 18కి వాయిదా వేసింది.