తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేసింది. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజుకు 50 వేల పరీక్షలు చేయాలన్న ఆదేశాలను అమలు చేయట్లేదన్న హైకోర్టు…ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం అమలు చేయడం లేదని అభిప్రాయపడింది.
అవసరం ఉన్నప్పుడు రోజుకు 50వేల పరీక్షలు చేస్తామని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొనటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజారోగ్య సంచాలకుడికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామన్న హెచ్చరించింది. ఫిర్యాదులు వస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని ప్రశ్నించింది. యశోద, కిమ్స్, కేర్, సన్షైన్ ఆస్పత్రులపై ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.