2018లో తెలంగాణ, ఒడిశా సరిహద్దులోని చర్లలో జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అంటూ ప్రజా హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. చనిపోయినవారికి రీ పోస్టుమార్టం, పోలీసులపై హత్యా నేరం కింద కేసు పెట్టాలని హైకోర్టును కోరింది.
పిటిషనర్ కోరిన విధంగా రీ పోస్టుమార్టం, హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. కాబట్టి.. తదుపరి ఎలాంటి విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది హైకోర్టు. ఆర్డర్ కాపీ వచ్చిన 3 నెలల లోపు ఎన్ కౌంటర్ కు సంబంధించిన దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది న్యాయస్థానం.