నేషనల్ యూత్ డే సందర్భంగా రవీంద్రభారతిలో ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ పోలీస్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో సీఏపీ సైబర్ అంబాసిడర్స్ ప్లాట్ ఫామ్ లాంచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ ఆలీ, డీజీపీ అంజనీకుమార్, పోలీస్ ఉన్నతాధికారులు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సెక్రెటరీ రోనాల్డ్ రోస్, విద్యాశాఖ సెక్రెటరీ కరుణ, స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా సైబర్ అంబాసిడర్స్ ఫ్లాట్ ఫామ్ లోగోను హోమ్ మంత్రి మహమూద్ ఆలీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పొలీసులు నెంబర్ వన్ అని కొనియాడారు. సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. కరోనా టైం నుంచి సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారు. పోలీసులు కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. టెక్నాలజీ పెరిగింది.. దీంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగాయన్నారు.
ప్రజల కోసం పొలీసులు నిరంతరం పని చేస్తున్నారు. స్కూల్స్ లో సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాల నియంత్రణ కోసం పని చేస్తున్నారు. సైబర్ అంబాసిడర్స్ పై సైబర్ కంట్రోల్ కి బాధ్యత ఉందన్నారు. ఉమెన్ సేఫ్టీ కోసం షీ టీమ్స్, భరోసా సెంటర్స్ పని చేస్తున్నాయి.
అనంతరం డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. పెట్రోల్ వెహికిల్స్ లాగా సైబర్ పెట్రోల్ వచ్చింది. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలన్నారు. సైబర్ సెక్యూరిటీలో ముందు ఉండాలి. సేఫ్టీ అంటే ఫిజికల్ గానే కాకుండా.. డేటా,సెక్యూరిటీ లో కూడా ఉండాలన్నారు.
ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ స్కూల్ లో ఈ సైబర్ అంబాసిడర్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి స్కూల్ నుంచి నలుగురిని సెలెక్ట్ చేసి సైబర్ నేరాలపై ట్రైనింగ్ ఇస్తామన్నారు. వాళ్లు ఆ స్కూల్స్ లో అందరికీ సైబర్ నేరాలపై అవగాహన కల్పించి, అప్రమత్తం చేస్తారన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలు తగ్గే విధంగా కృషి చేయాలన్నారు. 380 స్కూల్స్ లో సైబర్ అంబాసిడర్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు రోనాల్డ్ రోస్.