• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » మందులపై 12 శాతం ధరలు పెంచడం దారుణం: మంత్రి హరీష్

మందులపై 12 శాతం ధరలు పెంచడం దారుణం: మంత్రి హరీష్

Last Updated: March 30, 2023 at 9:36 pm

‘బీజేపీ పాలనలో అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్’ అంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు కాపాడే మందుల ధరలు 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య అన్నారు హరీష్. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మెడిసిన్స్‌తో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుందన్నారు మంత్రి హరీష్‌.

మందుల ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం పడిందని ఫైర్ అయ్యారు. సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బీజేపీ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నద‌ని మండిప‌డ్డారు. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైందని.. ఇది అత్యంత బాధాకరమని ధ్వజమెత్తారు మంత్రి హరీష్ రావు.

కాగా ఇటీవల మంత్రి హరీష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. కరోనా పట్ల ఆందోళన వద్దని, అప్రమత్తంగా ఉందామని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దని హరీష్‌రావు తెలిపారు.

అర్హులైనవారు వ్యాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని, అన్ని పీహెచ్‌ సీ, యూపీహెచ్‌ సీలలో వాక్సిన్ అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణకు మరిన్ని వ్యాక్సిన్‌ డోసులు సరఫరా కోసం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.

Primary Sidebar

తాజా వార్తలు

ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని మోడీ సర్కార్ అమలు చేస్తోంది!

టీఎస్పీఎస్సీ లీక్ కేసు: విప్రో అసిస్టెంట్ మేనేజర్ అరెస్ట్

డీకేతో వైఎస్ షర్మిల భేటీ.. అంతా సస్పెన్స్ !

బంజారా హిల్స్ లో ఆగి ఉన్న డీసీఎం ను ఢీకొట్టిన కారు…!

అక్రమ అబార్షన్ ల గుట్టురట్టు..!

మహబూబాబాద్ జిల్లా సంకీసలో క్షుద్రపూజల కలకలం…!

కోరుట్లలో ఉద్రిక్తత!

కాంగ్రెస్ బాటలోనే..బీజేపీ కూడా: పాల్‌!

తొలిసారిగా డిజిటల్ పద్దతిలో జనగణన.. ప్రతి పౌరుడికి 31 ప్రశ్నలు

రెజ్లర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా ? కేంద్రంపై కేటీఆర్ నిప్పులు

అపాచీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్

టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో కొత్త మలుపులు!

ఫిల్మ్ నగర్

SreeLeela in an international Movie

ఇంటర్నేషనల్ సినిమాలో శ్రీలీల

New rumors on kushi Movie

ఖుషీ కథ కాపీ కొట్టారా?

ఒకప్పుడు వాన...ఇప్పుడు నిప్పు..శాపంగా మారిన వీరమల్లు సెట్..!

ఒకప్పుడు వాన…ఇప్పుడు నిప్పు..శాపంగా మారిన వీరమల్లు సెట్..!

Teja Announced another casting call

మరో 45 మంది కొత్తవాళ్లకు అవకాశం

What is happening in UV creations

అసలు ‘యూవీ’ లో ఏం జరుగుతోంది?

People Media another movie with Prabhas

ప్రభాస్ తో పీపుల్ మీడియా మరో సినిమా

keerthy suresh s father on rumours about her love life with farhan

పెళ్లి కుదిరితే నేనే చెప్తా: కీర్తి సురేష్‌ తండ్రి!

gulshan devaiah says he has huge crush on actress sai pallavi

హైబ్రిడ్ పిల్ల పై మనసైందంటున్న ఆ హీరో!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap