‘బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి’ అని పేర్కొన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ప్రకటించిన నష్ట పరిహారంపై.. శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ‘ఒక్క తెలంగాణలోనే అన్నదాతకు.. పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు.
అందుకే ‘ఒక్క కేసీఅర్ సారు ఉంటే చాలు.. తమకు అదే పదివేలు’ అని రైతుల మనోగమతమని తెలిపారు. వేరేటోళ్లను పొరపాటున నమ్మినా.. తెలంగాణ మళ్లీ వందేళ్లు వెనక్కి వెళ్తుందని’ స్పష్టం చేశారు కేటీఆర్.
కాగా గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అలాగే సాధారణ రైతులతో పాటు కౌలు రైతులకూ పరిహారం అందిస్తామని చెప్పారు. కౌలు రైతులకు మేలు చేకూర్చేందుకు 2015 నాటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన జీవోనూ సవరిస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
BRS అంటేనే..
భారత ” రైతు ” సమితిఒక్క
తెలంగాణలోనే
మన అన్నదాతకు…
పెట్టుబడికి రూ.పదివేలు
పంట నష్టపోతే రూ.పదివేలుఅందుకే
మన రైతన్న మనోగతం
” ఒక్క కేసీఅర్ సారు ఉంటే చాలు…
మాకు అదే పదివేలు… ”వేరేటోళ్ళను
పొరపాటున నమ్మినా…
తెలంగాణ మళ్ళీ వెనక్కి.. వందేళ్లు pic.twitter.com/FyjjGIaIug— KTR (@KTRBRS) March 24, 2023