తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 42,485 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా.. 253 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2,87,993కి చేరింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాలు 1,554కి పెరిగాయి.
కరోనాబారి నుంచి తాజాగా 317 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 2,81,400కి పెరిగాయి. ప్రస్తుతం 5,039 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 2,793 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 70.61 లక్షల కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది.