తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 38,985 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా.. 346 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇందులో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 66 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2,89,135కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాలు 1,561కి పెరిగాయి.
కరోనాబారి నుంచి తాజాగా 397 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 2,82,574కి పెరిగాయి. ప్రస్తుతం 5 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 2,798 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 71.84 లక్షల కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది.