తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 59,471 మందికి పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 596 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం కేసులు 2 లక్షల 72 వేల 719కి చేరాయి. మరోవైపు కరోనా కారణంగా నిన్న ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,470కి పెరిగింది.
కరోనా నుంచి నిన్న మరో 972 మంది కోలుకున్నారు. వీటితో కలిపి మొత్తం రికవరీలు 2 లక్షల 62 వేల 751కి చేరాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 8 వేల 498 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 6 వేల 465 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు.