తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది గడిచిన 24 గంటల్లో కొత్తగా 47 వేల 593 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 993 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 66 వేల 42కి చేరింది.అటు కరోనా కారణంగా నిన్న నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,441కి పెరిగింది.
కరోనా నుంచి నిన్న 1150 మంది కోలుకున్నారు. ఫలితంగా మొత్త రికవరీలు 2 లక్షల 53 వేల715కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 886 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 8 వేల 594 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 52.48 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.