తెలంగాణలో గతంతో పోలిస్తే కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 40 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1015 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2 లక్షల 54 వేల 666కి చేరింది. అటు కరోనా కారణంగా నిన్న ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1393కి పెరిగింది.
ఇక కరోనా బారి నుంచి నిన్న 1716 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 2 లక్షల 35 వేల 950కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17 వేల 323 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 14 వేల 694 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా ఇప్పటి వరకు తెలంగాణలో 47.70 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు