– హిందూ యువకులను ఇస్లాంలోకి మార్చి ఉగ్రవాద శిక్షణ
– తమ కుమారుడ్ని తమకు ఇప్పించాలని తల్లిదండ్రుల ఆవేదన
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తిలో హిందువులను మతం మార్చి ఉగ్రవాద శిక్షణకు పంపిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ అంటోంది. విక్కీ అనే ముస్లిం వ్యక్తి హిందువులను ఏమార్చి మతం మారుస్తున్నాడని చెబుతోంది. తమ దగ్గర ఉపాధి కోసం పనిచేసే యువకులకు ఇస్లాం గురించి నూరి పోస్తూ ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. హిందూ యువకులు ముస్లింలుగా మారితే, ఆ వర్గం అమ్మాయిలను ఇచ్చి పెళ్లి కూడా చేస్తామని కూడా వారిని ఏమారుస్తున్నట్లు చెబుతోంది.
కల్వకుర్తి పట్టణానికి చెందిన శివ రామాచారి అనే యువకుడిని మతం మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు, నిజాంబాద్ తదితర నగరాలలో ఉగ్రవాద శిక్షణకు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై శివ రామాచారి తండ్రి భాస్కరాచారి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశాడు. వెంటనే తన కుమారుడిని తీసుకువచ్చి తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాడు.
తన కుమారుడిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చాక ఉగ్రవాదంలోకి పంపుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. వెంటనే అతడ్ని తీసుకురావాలని కన్నీరు మున్నీరవుతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును మతం మార్చి ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నారని తల్లిదండ్రులు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. పోలీసులు స్పందించాలని వేడుకుంటున్నారు.
విక్కీ అనే ముస్లిం వ్యాపారి దగ్గర ఇంకా కొంతమంది హిందూ యువకులు ఉన్నారని.. వారందరిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు శిక్షణ ఇప్పిస్తున్నట్లుగా చెబుతోంది విశ్వహిందూ పరిషత్. ఈ సంఘటన విషయమై.. కల్వకుర్తి పోలీస్ అధికారులను సంప్రదించగా పూర్తి వివరాలు సేకరిస్తామని సమాధానం చెప్పారని అంటోంది. అవసరమనుకుంటే విక్కీ కాల్ డేటాను పరిశీలిస్తామని పోలీసులు చెప్పినట్లు వివరించింది వీహెచ్పీ.