ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో బూస్టర్ డోస్ కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో మూడో డోస్ ఏ మేరకు సమర్ధవంతంగా పనిచేస్తుంది.. యాంటీబాడీలు ఎంత కాలం ఉంటాయనే అంశంపై అమెరికా సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనం చేపట్టింది. ఫైజర్, మోడెర్నా ఎంఆర్ఎన్ఏ టీకాలను మూడో డోస్ గా తీసుకున్న నాలుగు నెలల తర్వాత వాటి సామర్థ్యం తగ్గుతున్నట్టు అధ్యయనంలో తేలింది. దీంతో రెండు డోస్ లు తీసుకున్న కొద్ది రోజుల తర్వాత టీకా సామర్థ్యం తగ్గుతున్నట్టు, బూస్టర్ డోస్ వేసుకున్నా రక్షణ తక్కువగానే ఉన్నట్టు సీడీసీ వెల్లడించింది.
అధ్యయనంలో భాగంగా గతేడాది ఆగస్గు 26 నుంచి 2022 జనవరి 22 మధ్య ఆస్పత్రులను సంప్రదించి.. కోవిడ్-19 వంటి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 93,408 మంది రోగులను పరిశీలించారు నిపేణులు. పాజిటివ్ వచ్చిన తర్వాత టీకా వేసుకున్న వారు.. తీసుకోని రోగుల మధ్య అసమానతలను పోల్చి చూశారు. డోస్ తీసుకున్న సమయం, భౌగోళిక ప్రాంతం, వయసు, స్థానిక వ్యాప్తి స్థాయి, రోగి ఆరోగ్య సమస్యలు వంటి లక్షణాల ఆధారంగా స్టాటిస్టిక్ విధానం ద్వారా వ్యాక్సిన్ సామర్థ్యాన్ని అంచనా వేసినట్టు వెల్లడించారు.
ఒమిక్రాన్ వ్యాప్తి సమయంలో కోవిడ్, అనుబంధ అత్యవసర విభాగం లేదా ఎమర్జెన్సీ విభాగంలో టీకా సామర్థ్యం మూడో డోస్ వేసుకున్న రెండు నెలల తర్వాత 87 శాతం ఉన్నట్టు తెలిపారు. నాల్గో నెలకు ఇది 66 శాతానికి పడిపోతోందన్నారు. అలాగే.. పూర్తిస్థాయి టీకా తీసుకున్న మొదటి రెండు నెలల్లో ఆస్పత్రిలో చేరే ముప్పు 91 శాతం తగ్గిపోగా.. మూడో డోస్ తీసుకున్న నాల్గో నెల 78 శాతానికి పడిపోతోందని అధ్యనంలో వెల్లడైందని తెలిపారు.
మూడో డోస్ తీసుకున్న నెలలోనే ఎంఆర్ఎన్ఏ టీకాల ద్వారా వచ్చిన రక్షణ క్షీణిస్తోందని పేర్కొన్నారు. దీనిని మెరుగుపరచడానికి అదనపు డోస్ ల ప్రాముఖ్యతను మరింత బలపరుస్తుంది అని ఆథర్స్ తెలిపారు. కాగా.. లిల్లీ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అభివృద్ధి చేసిన బెబ్ టెలోవిమాబ్ అనే ఔషధానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం అనుమతించింది. ముప్పు ఎక్కువగా ఉన్న 12 ఏళ్లు దాటిన చిన్నారులకు ఈ ఔషధం వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒమిక్రాన్ పై బెబ్ టెలోవిమాబ్ సమర్ధంగా పనిచేస్తున్నట్టు క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడయ్యింది.