ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని రాజీవ్ రోజ్ గార్ యోజన ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తలసరి గ్రాంటు, ఇతర గ్రాంటులు నిలిపివేస్తున్నారు . రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా, కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా పక్కదారి పట్టిస్తోంది.
రాష్ట్రంలో సర్పంచుల నిధులు, హక్కులు కాపాడటం కోసమే మేము ధర్నా చేస్తున్నాం. గ్రామ స్వరాజ్యంతోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి జరుగుతోంది. కేవలం ఎన్నికల నిర్వహణ ద్వారా అభివృద్ధి జరగదు.
కనీసం ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ సర్పంచులకైనా నిధులు వెంటనే సమకూర్చాలి . ఏకగ్రీవమైనా గ్రామ పంచాయతీలకు సర్కారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఏకగ్రీవం కాకుండా ఎన్నికల్లో తాగి తందనాలు ఆడితే అబ్కారీ శాఖకు ఆదాయం వస్తుండేనని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
గ్రామ పంచాయతీలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి నిధులు రాలేదు. ఎన్ఆర్ఐజీ నిధులు లేకపోతే ప్రతి సర్పంచ్ రాజీనామాలు చేసేవారు.