డ్రగ్స్ కేసులో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను పోలీసులు గుర్తించారు. టోనీ తో పాటు 9 మంది నిందితులను 7 రోజులు పాటు కస్టడీకి పోలీసులు కోరారు. అయితే కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. కస్టడీ పై ఈ రోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది.
ఇక నిందితులను కస్టడీకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అలాగే మరోవైపు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. టోనీ దగ్గర నుండి కొన్నేళ్లుగా డ్రగ్స్ ను వ్యాపారవేత్తలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
గతంలో వందల కోట్ల డ్రగ్స్ వ్యాపారం చేసి అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ గా మారాడు టోనీ. లావాదేవీలన్నీ డార్క్ వెబ్ సైట్ ద్వారా నిర్వహించినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు.
తన సెల్ ఫోన్ లో ఉన్న డాటాను, వాట్సాప్ చాటింగ్ లను ఏర్పాటు డిలీట్ చేస్తూ వస్తున్నారు టోనీ.పోలీసులు టోనీ కి సంబంధించిన రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ ఉన్న డాటాను, వాట్సాప్ చాటింగ్ ను రికవరీ పోలీసులు రికవరీ చేశారు.
టోనీ సెల్ ఫోన్ లో మరికొంతమంది వ్యాపారులకు సంబంధాలు
ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 34 మంది ని గుర్తించిన పోలీసులు ఇప్పటికే 9 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.