ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పోటీల్లో ఒకటైన కామన్వెల్త్ క్రీడల సంబరం మొదలైంది. 22వ కామన్వెల్త్ గేమ్స్ ఆరంభోత్సవ వేడుకలు గురువారం అట్టహాసంగా సాగాయి. వేల మంది క్రీడాభిమానులు, ప్రేక్షకుల మధ్య 72 దేశాల క్రీడాకారులు జాతీయ పతాకాల్ని ధరించి మార్చ్ఫాస్ట్లో పాల్గొన్నారు.
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గాయపడటంతో భారత జట్టు ఫ్లాగ్ బేరర్లుగా డబుల్ ఒలింపిక్ విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుతో పాటు హాకీ టీమ్కెప్టెన్ మన్ప్రీత్ వ్యవహరించారు. ఇక ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బ్రిటన్ ఫేమస్ బ్యాండ్ డ్యూరన్ డ్యూరన్ లైవ్ షో హైలైట్ గా నిలిచింది.
కాగా, ఈ మెగాక్రీడలు ఈ జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరుగనున్నాయి. దాదాపు 72 దేశాలకు చెందిన ఐదు వేల మంది అథ్లెట్లు పతాకాల కోసం పోటీపడబోతున్నారు. ఈ క్రీడల్లో తొలిసారి మహిళల క్రికెట్ను చేర్చడం విశేషం.
పాకిస్థాన్ క్రీడాకారుల బృందానికి ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బిస్మా మరూఫ్ ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరించింది.ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనడం అనుమానంగా మారింది. కానీ శ్రీలంక ప్లేయర్స్ కూడా మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు. ఆయా దేశాల క్రీడాకారులు విభిన్నమైన దుస్తుల్లో పరేడ్ లో పాల్గొనగా శ్రీలంక ప్లేయర్స్ మాత్రం స్పోర్ట్స్ డ్రెస్ లో మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు.
Flagbearers @Pvsindhu1 and @manpreetpawar07 lead #TeamIndia out in the Parade of Nations at the #B2022 Opening Ceremony 🇮🇳🎆
What a moment! 😍#EkIndiaTeamIndia | @birminghamcg22 pic.twitter.com/rKFxWTzMfz
— Team India (@WeAreTeamIndia) July 28, 2022
Advertisements