అన్ని దేశాల కంటే ఇండియాలోనే పెట్రోల్ ధర తక్కువగా ఉందని.. అనవసరంగా మోడీ పెట్రోల్ ధరలు పెంచారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు ఆయన.
ఇక కేసీఆర్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీని గద్దె దింపడానికి సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. 9 ఏళ్ళ పరిపాలనలో మోడీ సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన అన్నారు. దీని కోసం మే 30 నుంచి జూన్ 30 వరకు మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం చేపట్టామన్నారు.
కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఇక రాష్ట్రంలో అధికారం రావడమే టార్గెట్ గా బీజేపీ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పై ప్రతిపక్షాలు అనవసరంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఇక మహాజన్ సంపర్క్ అభియాన్ అంటే ప్రజలను కలిసే సమావేశమన్నారు కిషన్ రెడ్డి.