పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీకి చుక్కెదురైంది. ఆయన హెలికాప్టర్ కు విమానయానశాఖ అధికారులు అనుమతిని నిరాకరించారు. చండీఘడ్ లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో అక్కడ నో ఫ్లై జోన్ ప్రకటించారు. దీంతో చన్నీ హెలికాప్టర్ టేకాఫ్ తీసుకోవడానికి అధికారులు అనుమంతించ లేదు
హోషియార్ పూర్ రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో చరణ్ జిత్ పాల్గొనాల్సి ఉంది. దీంతో.. ఆయన చండీఘడ్ నుంచి హోషియార్ పూర్ కు హెలికాప్టర్ లో బయల్దేరేందుకు సిద్ధమయ్యారు.
అందుకు అధికారులు అనుమతి నిరాకరించడంతో ఆయన ఆగిపోయారు. మరోవైపు.. రాహుల్ గాంధీ హెలికాప్టర్ హోషియార్ పూర్ కు వెళ్లడానికి అనుమతించారు.
కానీ.. చన్నీ హెలికాప్టర్ కు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇంకోవైపు జలంధర్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు.