దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ చేపట్టిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్.. తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. 47 రోజుల పాటు 57 మంది సాక్షులను విచారించింది కమిషన్. విచారణలో భాగంగా ఫోరెన్సిక్ నివేదికలు, పోస్టుమార్టం రిపోర్ట్ లు, ఫోటో గ్రాఫ్స్, వీడియో గ్రాఫ్స్ తో పాటు వివిధ డాక్యుమెంటరీలను సేకరించింది.
దిశ ఎన్ కౌంటర్లో 19-2019 క్రైమ్ నెంబర్ 784 నిందితులగా ఉన్న.. జోల్లు శివ, నవీన్, మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నెకేశవులు ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ సిర్పూర్కర్ ఆధ్వర్యంలోనే కమిషన్ ను ఏర్పాటు చేసింది. విచారణ పూర్తి చేసిన కమిషన్ నివేదికను కోర్ట్ వారికి అందజేసింది. డిసెంబర్ 12, 2019 కమిషన్ ఏర్పాటుకాగా.. కరోనా కారణంగా విచారణ ఆలస్యమైంది.
విచారణలో భాగంగా దిశ కమిషన్.. ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను.. పోస్టుమార్టం చేసిన డాక్టర్లను ప్రశ్నించింది. అప్పట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న వీసీ సజ్జనార్ పై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. 2019లో మొదలైన ఈ కమిషన్ విచారణ దాదాపు 47 రోజుల పాటు కొనసాగింది.
సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి సుప్రీం కోర్టు సిర్పూర్కర్ కమిషన్ ను నియమించింది. ఈ ఎన్ కౌంటర్ పై అప్పట్లో ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విచారణ పూర్తి కావడంతో శుక్రవారం నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది కమిషన్.