• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » కేసీఆర్ మౌనానికి కారణమేంటి..?

కేసీఆర్ మౌనానికి కారణమేంటి..?

Last Updated: June 20, 2022 at 12:31 pm

  • క్షీణించిపోతున్న శాంతిభద్రతలు
  • ఆందోళనలతో అట్టుడుకుతున్న తెలంగాణ

ఓవైపు రాష్ట్రంలో మితిమీరిపోతున్న అరాచకాలు.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు.. ఇంకోవైపు డైవర్ట్ రాజకీయాలతో అయోమయంలో ప్రజలు.. ఇది తెలంగాణలో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న అస్థిరతకు కారణం ఎవరు..? అరాచకాలు, ఆందోళనల వెనుక ఎవరున్నారు..? విపత్కర పరిస్థితుల్లో కూడా అధికార యావతో ప్రజలను మభ్యపెడుతున్నదెవరు..? నేడు ఇలాంటి అనుమానాలు తెలంగాణ ప్రజల్లో నెలకొన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు, మహిళలపై అఘాయిత్యాలు, ఆందోళనలు వరుసగా చోటు చేసుకుంటుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై అత్యాచారంతో పాటు భాగ్యనగరం పరిసర ప్రాంతాల్లో వరుసగా అఘాయిత్యాలు చోటుచోసుకుంటుండంతో రాష్ట్రంలో రక్షణ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ఘటనల్లో టీఆర్ఎస్ లీడర్ల ప్రమేయం ఉందనే వాదనలు వినిపిస్తుండటంతో గులాబీ పార్టీలో తీవ్ర స్థాయిలో అస్థిరత నెలకొంది. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏడు రోజులుగా తమ సమస్యలపై గళమెత్తుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల గేట్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హామీ ఇస్తే తప్ప పోరాటం ఆపబోమని వారు స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో వరుస ఆందోళనలు, అరాచకాల పర్వంతో టీఆర్ఎస్ సర్కారు అప్రతిష్టపాలవుతోంది. తెలంగాణలో వివిధ వర్గాల ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై వరుస ఆందోళనలతో ఇరుకున పెడుతుండటంతో అధికార పార్టీ పాలుపోని స్థితిలో మిన్నకుండిపోయింది. ముఖ్యంగా అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వ అసంబద్ధ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై బిజెపి పోరుయాత్ర చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అయోమయ స్థితిలో పడిపోయింది.

మొత్తానికి సంక్లిష్ట పరిస్థితులతో చిత్తవుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇదే తరుణంలో ప్రజా వ్యతిరేత నుంచి పార్టీని గట్టెక్కించాలనే ఉద్దేశంతో రాజకీయ వ్యూహకర్త పీకేను ఫీల్డ్ లోకి దించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంను పావుగా వాడుకుని ఆందోళనలకు తెరతీసినట్లు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్ లో జరిగిన విధ్వంసం వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వం హస్తముందని బిజెపి, కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ఆలోచనలో భాగంగానే సాయుధ బలగాల నియామకాల కోసం తీసువకువచ్చిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనకు తెరతీశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ.. సికింద్రాబాద్​లో చేసిన ఆందోళనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో సాయి డిఫెన్స్‌ అకాడమీ నిర్వహిస్తున్న సుబ్బారావు నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విధ్వంసంలో సుబ్బారావు పాత్ర ఉందని భావించిన పోలీసులు.. అతడిని అరెస్ట్​ చేసి మూడు రోజుల నుంచి పలు కోణాల్లో గోప్యంగా విచారిస్తున్నారు. ఇదే కేసపులో అరెస్టయిన పలువురు యువకులు చంచల్​గూడ జైళ్లో ఉన్నారు. మొత్తానికి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిగితే ఆందోళనల కుట్రదారులెవ్వరనేది తెలిసే అవకాశముంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ప్రభుత్వాన్ని నడిపిస్తోంది కేసీఆర్ కాదు!

జోక్.. బీజేపీకి టీఆర్ఎస్ పోటీనా?

వేలు విడిచిన మేనమామ అంటే ఎవరు…?

మోడీ షెడ్యూల్.. మినిట్ టు మినిట్!

ముర్ముకే ఛాన్స్.. కాంగ్రెస్ కు షాకిచ్చిన దీదీ

పేదల ఇళ్లు కూల్చిన టీఆర్ఎస్ నేతలు

భక్తజనసంద్రం.. పూరీ క్షేత్రం..కన్నులపండువగా రథోత్సవం

తెలంగాణ నుంచి మోడీ పాఠాలు నేర్చుకోవాలి… కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

కర్పూరం ఎలా తయారు చేస్తారు…? తినే కర్పూరం ఎలా ఉంటుంది…?

ఇకపై ఆ నీటి వినియోగానికి అనుమతులు తప్పనిసరి…!

షిండేను అందుకే సీఎం చేశారా…!

ఇకపై నా టార్గెట్ అదే – రాజమౌళి

ఫిల్మ్ నగర్

ఇకపై నా టార్గెట్ అదే - రాజమౌళి

ఇకపై నా టార్గెట్ అదే – రాజమౌళి

నితిన్ సినిమాకు రూ.30 కోట్లు కావాలంట?

నితిన్ సినిమాకు రూ.30 కోట్లు కావాలంట?

నాని దసరా మూవీ అప్ డేట్స్ ఇవే

నాని దసరా మూవీ అప్ డేట్స్ ఇవే

అల్లూరి.. శ్రీవిష్ణు కెరీర్ లోనే భారీ యాక్షన్ డ్రామా

అల్లూరి.. శ్రీవిష్ణు కెరీర్ లోనే భారీ యాక్షన్ డ్రామా

పక్కా కమర్షియల్...ఇది చాలా కమర్షియల్ గురూ!! రివ్యూ

పక్కా కమర్షియల్…ఇది చాలా కమర్షియల్ గురూ!! రివ్యూ

ఇస్మార్ట్ బ్యూటీ.. ఇక సినిమాల‌కు దూర‌మేనా..?

ఇస్మార్ట్ బ్యూటీ.. ఇక సినిమాల‌కు దూర‌మేనా..?

సైబ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో క‌న్న‌డ న‌టి ప‌విత్రాలోకేష్..!

సైబ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో క‌న్న‌డ న‌టి ప‌విత్రాలోకేష్..!

ఓటీటీలోకి మేజ‌ర్ వ‌చ్చేది..ఎప్ప‌టినుండంటే..?

ఓటీటీలోకి మేజ‌ర్ వ‌చ్చేది..ఎప్ప‌టినుండంటే..?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)