సిద్దిపేట జిల్లా చౌటప్లలి గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. గ్రామసర్పంచ్ ను, మరికొందరు వ్యక్తులను గ్రామపంచాయతీలో నిర్భందించారు. అయితే గ్రామస్థులు గ్రామ సర్పంచ్ ను ఎందుకు నిర్భందించారనే సందేహం కలుగుతుంది. కాని ఊరికే కాదు దానికో పెద్ద కారణమే ఉంది.
సోమవారం అక్కన్న పేట మండలంలోని పలు గ్రామాలను హుస్నాబాద్ మండలంలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానిలో చౌటపల్లి మండలం లేదు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్భందించారు.
తాళం వేసి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామాన్ని హుస్నాబాద్ మండలంలో కలపాలని డిమాండ్ చేస్తూ “అక్కన్నపేట వద్దు హుస్నాబాద్ ముద్దు” అంటూ నినాదాలు చేశారు.
తమ గ్రామాన్ని హుస్నాబాద్ లో కలపాలనే కారణంతో గ్రామ సర్పంచ్ తో పాటు మరికొందరు వ్యక్తులను గ్రామపంచాయతీలో నిర్భందించామని గ్రామస్తులు చెబుతున్నారు.