• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Viral » అవీ ఇవీ... » పోలీసు సిబ్బంది పై దాడి..ఇద్దరు మహిళలపై కేసు నమోదు!

పోలీసు సిబ్బంది పై దాడి..ఇద్దరు మహిళలపై కేసు నమోదు!

Last Updated: March 10, 2023 at 12:00 pm

ప్రజలకు దగ్గర అవ్వాలనే ఉద్దేశ్యంతో పోలీసు ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇది పోలీసులకు తల నొప్పులను తెచ్చిపెడుతోంది. ఒకప్పుడు పోలీసుస్టేషన్‌కు వెళ్లాలంటే భయపడేవారు. ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసు ఉండడం వల్ల పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులతో పాటు నిందితులను కూడా పోలీసులు బెదిరించకపోవడంతో కొందరు రెచ్చిపోతున్నారు.

పోలీసులంటే గౌరవం లేకుండా పోతుందని పోలీసు అధికారులే వాపోతున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలోని కొన్ని పోలీసు స్టేషన్‌లలో జరిగిన సంఘటనలు చూస్తుంటే పోలీసులే ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. పోలీసులంటే లెక్క చేయకుండా కొందరు వ్యవహరిస్తున్నారు. గురువారం జిల్లాలోని గాంధారి పోలీసుస్టేషన్‌లో ఓ వివాదం విషయంలో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసినందుకు వారి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదం చేయడంతో పాటు కొందరు సిబ్బందిపై దాడికి యత్నించారు.

గురువారం గాంధారి పోలీసుస్టేషన్‌లో మండల కేంద్రానికి చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు గత మంగళవారం మాంసం విక్రయించే షఫీతో తగదా పడగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు జుబేర్‌, అజ్మత్‌ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తీసుకురాగా వారి వెంటే వచ్చిన కుటుంబ సభ్యులు, మహిళలు పోలీసులతో పెద్దఎత్తున వాగ్వాదానికి దిగారు.

తాము రాజీకుదుర్చుకుంటామని మీరు కేసు ఎందుకు పెడుతున్నారంటూ గొడవపడుతూ మహిళలు పోలీసులపై దాడులు చేశారు. ఈ గొడవలో కానిస్టేబుల్‌తో పాటు పలువురు సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందని సదాశివనగర్‌ సీఐ రామన్‌ ఆధ్వర్యంలో తాడ్వాయి, సదాశివనగర్‌ పోలీసులు గాంధారి పోలీసుస్టేషన్‌కు చేరుకుని దాడులకు పాల్పడిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

బలగానికి మరింత బలమిచ్చిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్…!

నేనొక తెలివిలేని దద్దమ్మని …యస్ ఐయామ్ ఏ రియల్ డఫర్…!

మీడియాకే షాకిచ్చిన ‘హౌజ్ ఆఫ్ మంచుస్’…!

భూమి అందాల్ని అద్భుతంగా చిత్రించిన…ఓషన్ శాటిలైట్-3..!

ఆ దొంగలు బంగారం…కాజేసిన బంగారాన్ని రిటర్నిచ్చేసారు…కాకపోతే..!?

బోస్ …ఇది నీ గెలుపు కాదు..మన తెలుగువారందరిదీ….!

మందులపై 12 శాతం ధరలు పెంచడం దారుణం: మంత్రి హరీష్

ఏటీఎంలో కాచుకున్న పాము…ఎంటరైన మహిళకు షాకిచ్చిన స్నేక్…!

మహిళా జర్నలిస్టులకు గుడ్ న్యూస్

గ్రూప్-1 లీక్ వ్యవహారం.. ఆ యువతికి శాపంగా మారింది!!

బాలీవుడ్ ‘ఛత్రపతి’గా బెల్లంకొండ శ్రీనివాస్…దుమ్ములేపుతున్న టీజర్..!

టీటీడీ ఉద్యోగి చేతివాటం.. ముత్యాల తలంబ్రాలు అపహరణ

ఫిల్మ్ నగర్

బలగానికి  మరింత  బలమిచ్చిన  బెస్ట్ ఫీచర్  ఫిల్మ్ అవార్డ్...!

బలగానికి మరింత బలమిచ్చిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్…!

నేనొక తెలివిలేని దద్దమ్మని ...యస్ ఐయామ్ ఏ రియల్ డఫర్...!

నేనొక తెలివిలేని దద్దమ్మని …యస్ ఐయామ్ ఏ రియల్ డఫర్…!

మీడియాకే షాకిచ్చిన ‘హౌజ్ ఆఫ్ మంచుస్’...!

మీడియాకే షాకిచ్చిన ‘హౌజ్ ఆఫ్ మంచుస్’…!

బోస్ ...ఇది నీ గెలుపు కాదు..మన తెలుగువారందరిదీ....!

బోస్ …ఇది నీ గెలుపు కాదు..మన తెలుగువారందరిదీ….!

బాలీవుడ్  ‘ఛత్రపతి’గా  బెల్లంకొండ శ్రీనివాస్...దుమ్ములేపుతున్న టీజర్..!

బాలీవుడ్ ‘ఛత్రపతి’గా బెల్లంకొండ శ్రీనివాస్…దుమ్ములేపుతున్న టీజర్..!

వాళ్ల తర్వాత రాహుల్ గాంధీయే.. యాక్టర్ రమ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వాళ్ల తర్వాత రాహుల్ గాంధీయే.. యాక్టర్ రమ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

'బలగం' మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత.. సర్కార్ ఆపన్న హస్తం

‘బలగం’ మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత.. సర్కార్ ఆపన్న హస్తం

g20 delegates in chandigharh dance to oscar winning naatu naatu

నాటునాటు స్టెప్పులేసిన జీ20 ప్రతినిధులు!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap