ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పరంగా ఎంతగా ముందుకు దూసుకుపోతున్న ఇంకా అక్కడక్కడ జాతి వివక్షలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. దానికి తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ఓ సంచార జాతికి చెందిన మహిళ తన పిల్లలతో కలిసి సినిమా చూద్దామని థియేటర్ కు వెళ్లింది.
తన దగ్గర ఉన్న డబ్బులతో టికెట్లు తీసుకుని లోపలికి వెళ్తుండగా సిబ్బంది వారిని లోపలికి వెళ్లకుండా నిలిపివేశారు. దానికి కారణం వారు సంచార జాతిలో పుట్టిన వారు కావడమే. చెన్నైలో థియేటర్ యాజమాన్యం నిర్వాకం చూసిన నెటిజన్లు వారి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గురువారం ప్రముఖ హీరో శింబు నటించిన పత్తు తల సినిమా విడుదల అయ్యింది. చెన్నైలోని రోహిణి థియేటర్ లో సంచార జాతికి చెందిన వారిని సిబ్బంది అనుమతించలేదు. టికెట్టు ఉంది అనుమతించాలని ప్రాధేయపడినా నిర్వాహకులు కనికరించలేదు.
తోటి ప్రేక్షకులు చెప్పినా వినకుండా సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లి పోవాలన్నారు.తమకు ఇష్టమైన హీరో సినిమా చూడడానికి వచ్చిన వారి జాతి వివక్ష పేరుతో ఇలా వెళ్లగొట్టడం పై పలువురు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.