ప్రసాదం కోసం గుడికి వెళ్లి తిరిగి వస్తున్న ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పమిడిముక్కల మండలం ఐనపూరు గ్రామానికి చెందిన దూడల సాంబశివరావు కుమార్తె కార్తీకమాసం మొదలైన దగ్గర నుంచి ప్రసాదం కోసం శివాలయం కు ప్రతి రోజు వెళ్లి వస్తుంది.
ఈ క్రమంలో గురువారం సాయంత్రం ప్రసాదానికి వెళ్ళిన పాప తిరిగి రాకపోవడంతో కంగారు పడుతూ తండ్రి సాంబశివరావు సాయంత్రం 6.30 పాప ను వెతుక్కుంటూ వెళ్లేసరికి రైస్ మిల్లు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో పాప తనుశ్రీ పై అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ళ దూడల ధనుష్ ఉండగా తండ్రి సాంబశివరావు కేకలు వేసుకుంటూ పరుగెత్తే సరికి ధనుష్ పారిపోయాడు.
రక్త స్రావంతో ఉన్న పాపను RMPడాక్టర్ వద్దకు తీసుకు వెళ్లగా అత్యాచారం జరిగినట్లు నిర్ధారించడం తో గురువారం రాత్రి పమిడిముక్కల పోలీసు స్టేషన్ లో తండ్రి సాంబశివరావు పిర్యాదు చేశాడు.
ఈ మేరకు శుక్రవారం ధనుష్ పై IPC 376, పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై G. శ్రీనివాస్ తెలిపారు.