ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ రుణాల పేరుతో ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అప్పులిచ్చే నిర్వాహకులు కూడా ఎంతో కఠినంగా, క్రూరమైన స్వభావంతో ఇచ్చిన రుణాలను తిరిగి తీసుకోవడానికి బాధితులను అనేక విధంగా వేధిస్తున్నారు. అప్పులు వసూలు చేయడానికి నిర్వాహకులు ఎంతటి దుర్మార్గానికి అయినా పాల్పడుతున్నారు.
అప్పు కావాలా అంటూ అడిగి రుణాలు ఇచ్చే యాప్ లు కొత్త పద్దతిని ఎంచుకున్నారు. బాధితుల ఫోన్ లకు సంక్షిప్త మెసేజ్ లు పంపించి వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేసి వేధింపులు.. చిత్రహింసలు పెడుతున్న రుణయాప్ల నిర్వాహకులు మరో విధంగా బాధితులను టార్గెట్ చేస్తున్నారు. రుణం వసూలు చేసుకునేందుకు అప్పు తీసుకున్న వారి ఫోన్లో మహిళలు.. యువతుల ఫోటోలను నెంబర్లను తీసుకుంటున్నారు. తర్వాత వారి ఫోటొలను నగ్ర చిత్రాలుగా మార్చి వారికే పంపుతున్నారు.
లోన్ తీసుకున్న వారి వివరాలు చెప్పి అతన్నీ వెంటనే లోన్ చెల్లించమని చెప్పండి లేదా మీ ఫోటోలు వీడియోల రూపంలో మారుతాయి అని భయపెడుతున్నారు. ఫోన్ కాంటాక్ట్లకు అనుమతి తీసుకుని.. వ్యక్తిగత పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తున్న నిర్వాహకులు రుణయాప్ డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. రుణం ఇచ్చేముందు ఆధార్ కార్డు, చరవాణిలో కాంటాక్ట్లిస్ట్ కావాలంటూ అనుమతులు తీసుకుంటున్నారు. అనంతరం నాలుగు రోజులకే ఫోన్ చేసి అసలు, వడ్డీ సొమ్ము కట్టాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు.
గడువు పూర్తి కాలేదు అని బాధితులు చెబుతున్నా.. వినకుండా వరుసగా ఫోన్లు చేస్తున్నారు. దారుణ యాప్లు.. “వాట్సాప్ డీపీల ద్వారా కొద్దినెలల నుంచి సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. రుణయాప్ నిర్వాహకులు యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తున్నారు. దీంతో ఏసీపీ సైబర్ క్రైమ్ కేవీఎం ప్రసాద్ స్పందించారు. ఎవరైనా సరే.. యాప్ల ద్వారా రుణం తీసుకోకూడదని.. తీసుకున్నా… ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ ఇవ్వకూడదని హెచ్చిరించారు. వేధింపులు మొదలైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.