తులసి రెడ్డి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
అప్పులు చేయడంలో, ప్రభుత్వ ఆస్తులు అమ్మడంలో మోడీ, జగన్ ప్రభుత్వాలు పోటీ పడడం శోచనీయం. మోడీ దేశాన్ని అప్పుల కుప్ప చేస్తుంటే జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు.
1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాల కాలంలో నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు 13 మంది ప్రధాన మంత్రుల పాలన లో కేంద్రం చేసిన అప్పు రూ. 46 లక్షల కోట్లు.
2014 నుంచి 2021 వరకు 7 సంవత్సరాల కాలంలో మోడీ పాలన లో కేంద్రం చేసిన అప్పు రూ.74 లక్షల కోట్లు. పాడి ఆవులాంటి ఎల్ ఐ సి లో 20 శాతం వాటా అమ్మాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయం. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప అయింది.
1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల కాలంలో నీలం సంజీవరెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో చేసిన అప్పు రూ. లక్ష కోట్లు.
జగన్ పాలనలో ప్రతి యేడాది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పు రూ. లక్ష కోట్లు. శక్తికి మించిన అప్పు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, ప్రజలపై పన్నుల భారం వేయడం, ధరలు పెంచడం జగన్ పాలనలో నిత్య కృత్యాలయ్యాయి.