ఎమిరేట్స్ ఎయిర్లైన్స్పై ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రముఖ బెంగాలీ నటి మిమీ చక్రవర్తి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన మిమీకి ఎమిరేట్స్ విమాన సిబ్బంది ఇచ్చిన ఆహారం చిరాకు కలిగించింది.
ఆమెకి ఇచ్చిన ఆహారంలో వెంట్రుకలు వచ్చాయి. అనంతరం ఈ విషయంపై ఎయిర్లైన్స్కు మెయిల్ చేసినా ఎయిర్లైన్స్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ఎయిర్ లైన్స్ తీరుపై మిమీ మండిపడింది.
‘మీ ఎయిర్లైన్స్లో ప్రయాణించే వ్యక్తుల గురించి పట్టించుకోనంత పెద్దవారు మీరని నేను భావిస్తున్నాను. ప్రయాణికులకు అందించే ఆహారంలో వెంట్రుకలు రావడం మంచిది కాదని నా అభిప్రాయం. ఈ విషయంపై మీ బృందానికి మెయిల్ చేశాను. కానీ, ఇప్పటి వరకు మీనుండి ఎలాంటి స్పందన రాలేదు.
ప్రయాణ సమయంలో నేను తింటున్న రోటీలో వెంట్రుకలు వచ్చాయి. మీరు ఎయిర్లైన్స్లో ప్రయాణిస్తున్న వ్యక్తుల గురించి ఆలోచించినట్లయితే.. మీరు మరోసారి నేను పంపిన మెయిల్ను చెక్ చేసుకోండి’ ఆగ్రహం వ్యక్తం చేసింది.
చివరకు ఎమిరేట్ ఎయిర్లైన్స్ స్పందిస్తూ క్షమాణలు చెప్పింది. ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలని, కస్టమర్ రిలేషన్స్ టీమ్ లేవనెత్తిన విషయం ఆధారంగా సమీక్షించడంతో పాటు మెయిల్ ద్వారా స్పందిస్తుందని తెలిపింది.
Dear @emirates i believe u hav grown 2 big to care less abut ppl traveling wit u.Finding hair in meal is not a cool thing to do i believe.
Maild u nd ur team but u didn’t find it necessary to reply or apologise @EmiratesSupport
That thing came out frm my croissant i was chewing pic.twitter.com/5di1xWQmBP— Mimi chakraborty (@mimichakraborty) February 21, 2023