• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » హస్తం.. ఐక్యతా రాగం!

హస్తం.. ఐక్యతా రాగం!

Last Updated: January 21, 2023 at 7:45 pm

– 60 రోజులు.. 50 నియోజకవర్గాలు
– ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే జోడో యాత్ర
– నేతలు పార్టీ లైన్ దాటొద్దన్న రేవంత్
– అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
– తాను అందరివాడినంటున్న థాక్రే
– కలిసికట్టుగా ఉండాలని నేతలకు సూచన
– సమస్య ఏదైనా తనకే చెప్పాలని స్పష్టం
– రేపు నాగర్ కర్నూల్ లో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ

ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ కు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కాంగ్రెస్ పరిస్థితే గందరగోళంగా ఉంది. అయితే.. కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే అన్నింటినీ సెట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. గాంధీ భవన్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వ్యూహాలు, హాత్ సే హాత్ జోడో యాత్రపై చర్చలు సాగించారు. థాక్రే పార్టీ నేతలకు ఓ సంకేతాన్ని పంపారు. తాను అందరివాడనని స్పష్టం చేశారు. ఎవరికీ అనుకూలం కాదని.. అలాంటి ఆలోచన పక్కన పెట్టేయాలని నేతలకు సూచించారు. హాత్ సే హాత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ సందేశాన్ని గడప గడపకు తీసుకువెళ్లాలన్నారు. అంతా ఐక్యంగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.

సమస్యలు ఉంటే తనతో చెప్పాలని సూచించారు. పార్టీకి నష్టం చేసేలా ఎవరూ మీడియా ముందు మాట్లాడొద్దన్నారు. ఇక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ పాదయాత్ర 60 రోజులపాటు సాగుతుందని.. భద్రాచలం లేదా మహబూబ్ నగర్ లేదా ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు.. 150 కోట్ల మంది నమ్మకాన్ని నిలబెట్టేందుకు రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలు పెట్టారని చెప్పారు. ఆ యాత్ర సందేశాన్ని ప్రతీ గుండెకు చేరవేయడానికే హాత్ సే హాత్ జోడో యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. వాస్తవానికి ఈనెల 26న కశ్మీర్ లో రాహుల్ యాత్ర ముగిస్తే అదే రోజు తెలంగాణలో యాత్ర మొదలు పెట్టాలనుకున్నామని.. కానీ, భద్రతా కారణాలు చూపి రాహుల్ జాతీయ జెండా ఎగురవేయకుండా బీజేపీ కుట్ర చేస్తోందని విమర్శించారు.

కశ్మీర్ లో జెండా ఎగరేసి తీరాల్సిందేనని రాహుల్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈనెల 30న ఈ కార్యక్రమం ఉంటుందని.. టీపీసీసీ, సీఎల్పీ సహా తెలంగాణ ముఖ్య నాయకులంతా ముగింపు సభకు హాజరవుతారన్నారు. దాని తర్వాత ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, 3 నుంచి శాసనసభ సమావేశాలు, 5న రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉందని.. అందుకే 6 నుంచి యాత్ర ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ లేదా ప్రియాంకాగాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని తీర్మానించామన్నారు. ఈ యాత్రలో రాహుల్ గాంధీ లేఖ, మోడీ, కేసీఆర్ వైఫల్యాలపై చార్జీషీటు వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ‘‘జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాతాపాటు పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. దీంతో హాత్ సే హాత్ జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఈ యాత్ర సమన్వయం కోసం పరిశీలకులను నియమించడం జరుగుతుంది. బాధ్యతగా పనిచేయని వారిని తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తాం. యాత్రలో పాల్గొనని వారిపై కూడా చర్యలుంటాయి’’ అని చెప్పారు రేవంత్.

రేపు నాగర్ కర్నూల్ లో సభ

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మార్కండేయ ప్రాజెక్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారని.. ఇంతవరకు తట్ట మట్టి తీయలేదన్నారు రేవంత్. ఈ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన నాగంపై బీఆర్ఎస్ నేతల దాడిపై సమావేశంలో చర్చించామని చెప్పారు. అంతేకాకుండా బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని మండిపడ్డారు. మహిళా సర్పంచును అవమానించారని నాగం జనార్దన్ రెడ్డిపై కూడా కేసు పెట్టారన్నారు. నాగం వల్ల ఎలాంటి అవమానం జరగలేదని డీఐజీ దగ్గర ఆ మహిళా సర్పంచ్ స్టేట్ మెంట్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అయినా ప్రభుత్వం తప్పు దిద్దుకోలేదని… అందుకే ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నాగర్ కర్నూల్ లో రేపు దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు మాణిక్ రావు థాక్రేతో పాటు ముఖ్య నాయకులంతా హాజరవుతారని వివరించారు రేవంత్.

Primary Sidebar

తాజా వార్తలు

భారీగా లోడవుతున్న లియో …కమల్ తో కనకరాజ్ మేజిక్ ఏంటి..!?

దిగిరానున్న పెట్రోల్ ధరలు…నష్టాలు సవరించడానికి కేంద్రం కసరత్తు…!

చెరువు పండుగ వద్దన్నారు… రోడ్డెక్కిన మత్స్యకారులు… ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దగ్ధం…!

సీఎంతో అంబటి వరుస భేటీలు… వైసీపీలోకి జాయినింగ్ ఫిక్స్..!

రాముడి కథను 10 వేలమందికి చూపించబోతున్న రణబీర్ …!

ముసలోళ్లే కానీ…డ్యాన్స్ ఇరగదీశారు..!

తెలంగాణలో 12 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం

పాపం పసివాడు.. బ్రిడ్జ్ పిల్లర్ స్లాబ్ మధ్య చిక్కుకున్నాడు..!!

ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగింది: కవిత

చెరువుల పండుగలో ఎర్రబెల్లి సందడి…వలవేసి నవ్వులు పూయించిన మంత్రి…!

వరద నీటిలో మందు పాతరలు.. ఉక్రెయిన్ డ్యామ్ బీభత్సం

పిల్లలపై ఉన్మాది దాడి… నలుగురి పరిస్థితి విషమం…!

ఫిల్మ్ నగర్

భారీగా లోడవుతున్న లియో ...కమల్ తో కనకరాజ్ మేజిక్ ఏంటి..!?

భారీగా లోడవుతున్న లియో …కమల్ తో కనకరాజ్ మేజిక్ ఏంటి..!?

రాముడి కథను 10 వేలమందికి చూపించబోతున్న రణబీర్ ...!

రాముడి కథను 10 వేలమందికి చూపించబోతున్న రణబీర్ …!

tirupati police reacts on adipurush fake poster viral on social media

అది ఫేక్ పోస్టర్.. ఎవరూ నమ్మవద్దు: తిరుపతి పోలీసులు

hero varun tej and lavanya tripathi engagement on june 9th confirmed by maga team

వరుణ్-లావణ్య నిశ్చితార్థం ఫిక్స్.. డేట్ ఎప్పుడంటే!!

Gandeevadhari Arjuna release date

వరుణ్ తేజ్ సినిమాకు డేట్ ఫిక్స్

nandamuri balakrishna nbk 108 officially titled as bhagavanth kesari

అన్న దిగిండు..ఇగ ఊచకోత షురూ!

Teja assurence to Srireddy

శ్రీరెడ్డికి న్యాయం చేస్తానంటున్న తేజ

Adipurush 2 contraversies

ఆదిపురుష్.. ఒకే రోజు, రెండు వివాదాలు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap