Advertisements
నిరంజన్, టీపీసీసీ అధికార ప్రతినిధి,
గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్ అనేక అక్రమాలకు పాల్పడింది. పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తల్లాగా పని చేసారు. కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను టిఆర్ఎస్ నేతలు, పోలీసులు వేదిస్తున్నారు. కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు..పార్టీ పూర్తిగా మీకు అండగా ఉంటుంది.పోలీసులు నిష్పక్ష పాతంగా వ్యవహరించాలి. రహమత్ నగర్ లో సిరిసిల్ల టిఆర్ఎస్ నాయకులు ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతూ దొరికారు. మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాము. ఈ విషయంలో ఎన్నికల సంఘం మాకు ఒక లెటర్ ఇచ్చారు.
లెటర్ లో ఫ్లైయింగ్ స్కాడ్ ను పంపాము, సిరిసిల్ల టిఆర్ఎస్ నాయకులను పట్టుకున్నామని, 15,300 రూపాయలు దొరికాయని చెప్పారు. పోలీస్ కమిషనర్ తర్వాత ఇచ్చిన లేఖలో ఎలాంటి డబ్బులు దొరకలేదు అని ఇచ్చారు. అంతే కాకుండా కాంగ్రెస్ నాయకులు ఎఫ్.ఎస్. సి టీమ్ వాహనాల ను పగలగొట్టారని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇంత ఘోరంగా పోలీసులు వ్యవహారిస్తున్నారు.
మా అభ్యర్థి భవాని శివశంకర్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అలాగే మా కాంగ్రెస్ నాయకులు జాఫర్ హుసేన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.పోలీసులు ఇలా పక్షపాతం తో వ్యవహరిస్తున్నారు. ఫ్లైయింగ్ స్కాడ్, పోలీసుల లేఖలు ఎన్నికల కమిషన్ కు పంపుతాము.