స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బాబాయ్ బుల్గానిన్ రోడ్డు ప్రమాదంకు గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఇదిలా ఉండగా సోదరుడి మరణ వార్తను విని తట్టుకోలేక దేవిశ్రీ ప్రసాద్ మేనత్త సీతామహాలక్ష్మీ గుండెపోటుతో మృతి చెందారు. కాగా వరుస మరణాలతో దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.