• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » ఎయిర్ పోర్టు వరకు మెట్రో.. సీఎం కేసీఆర్ శంకుస్థాపన

ఎయిర్ పోర్టు వరకు మెట్రో.. సీఎం కేసీఆర్ శంకుస్థాపన

Last Updated: December 8, 2022 at 4:32 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో మెగా ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టనున్నారు. హైదరాబాద్ నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రాజెక్ట్ ఉద్దేశించబడింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా- కొత్తగా ఎయిర్‌ పోర్ట్ ఎక్స్‌ ప్రెస్ మెట్రోను నిర్మించ తలపెట్టారు సీఎం కేసీఆర్. అతి తక్కువ సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకునేలా మెట్రో ప్రాజెక్ట్ ను రూపొందించనున్నారు.

Hyderabad Forges ahead on A Faster Track !

CM Sri KCR will lay the foundation stone for Airport Express Metro on 9th December, 2022.#HyderabadExpressMetro pic.twitter.com/mqYCB0Ggaa

— TRS Party (@trspartyonline) December 8, 2022

ఐటీ హబ్‌గా గుర్తింపు ఉన్న గచ్చిబౌలి-మాదాపూర్-కొండాపూర్-మైండ్ స్పేస్ టెక్నాలజీ పార్కులకు రాకపోకలు సాగించడానికి వీలుగా దీన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ఆయా ప్రాంతాల నుంచి మెట్రో రైలు ద్వారా అతి తక్కువ సమయంలో నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకోవచ్చు. ప్రపంచ స్థాయి పెట్టుబడులతో భారీగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎయిర్ పోర్టుకు మెట్రో అనుసంధానం చేస్తే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే మూడేళ్లలో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని కేసీఆర్ చెప్పారు. ఇది మెట్రో బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్డు మీదుగా ఔటర్ రింగ్ రెడ్డు వద్ద నానక్ రామ్ గూడ జంక్షన్ ను తాకుతుంది.

హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా విలువ 6,250 కోట్ల రూపాయలు. ఈ మార్గంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తున్నాయి. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు దీన్ని నిర్మించ తలపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మైండ్ స్పేస్ జంక్షన్-శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ మధ్య 31 కిలోమీటర్ల మేర నిర్మాణాన్ని పూర్తి చేసుకోనుంది.

Primary Sidebar

తాజా వార్తలు

ఈ నెల 29న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

పరీక్షా పే చర్చ నాకు కూడా ఓ పెద్ద పరీక్ష….!

భారత్ జోడో యాత్ర… రాహుల్‌ను కలిసిన ఒమర్ అబ్ధులా ..!

బీఆర్ఎస్ మహారాష్ట్ర బహిరంగ సభ షెడ్యూల్ ఇదే..!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్.. కానీ కండీషన్స్ అప్లై

‘యువగళం’ యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఎన్టీఆర్..!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

సొంత నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు… శరత్ చంద్రా రెడ్డికి బెయిల్ మంజూరు…!

మొదలైన ”యువగళం” పాదయాత్ర!

రెడ్ జోన్లో అదానీ కంపెనీ షేర్లు..!

ఫిల్మ్ నగర్

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

వరంగల్ లో వీరయ్య విజయ విహారం

వరంగల్ లో వీరయ్య విజయ విహారం

ఆలనాటి సత్యభామ ఇక లేరు!

ఆలనాటి సత్యభామ ఇక లేరు!

గ్రాండ్ గా వెంకీ సినిమా ఓపెనింగ్

గ్రాండ్ గా వెంకీ సినిమా ఓపెనింగ్

ఎట్టకేలకు స్పందించిన బాలయ్య..!

ఎట్టకేలకు స్పందించిన బాలయ్య..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap