భారీ వర్షాలు విద్యాశాఖ షెడ్యూల్ నే మార్చేస్తున్నాయి. ఇప్పటికే 3 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఇదే క్రమంలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తోంది. 13న జరగాల్సిన ఈసెట్ ను వాయిదా వేశారు అధికారులు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది.
వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై కన్వీనర్లు, ఇతర సంబంధిత అధికారులతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సమీక్ష జరిపారు. ఈనెల 13 వరకు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం.. పలు ప్రాంతాల్లో వరద ఉద్ధృతి ఉన్నందున ఈసెట్ వాయిదా వేయాలని నిర్ణయించారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని తర్వాత ఖరారు చేస్తామని పేర్కొన్నారు లింబాద్రి.
ఇప్పటికే పలు యూరివర్సిటీలు సైతం పరీక్షలను వాదాయి వేశాయి. ఈ క్రమంలోనే ఉన్నత విద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఎంసెట్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. ఈనెల 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, 18 నుంచి 20 వరకు జరిగే ఇంజనీరింగ్ ఎంసెట్ యథాతథంగా ఉంటుందని తెలిపింది. ఈ షెడ్యూల్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
ఎంసెట్ వాయిదా వేస్తే ఆన్ లైన్ పరీక్షలకు షెడ్యూల్ ఖరారు చేయడం కష్టమన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ఉన్నత విద్యామండలి.