అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది. మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటివరకు ఏం చేశారని ప్రశ్నించింది. నియామక ప్రక్రియ నత్తనడకన సాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది.
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరత వల్ల కేసుల విచారణ ముందుకు సాగడం లేదని అభిప్రాయపడింది హైకోర్టు. దీంతో నియామక ప్రక్రియకు 18 వారాల గడువు కోరింది ప్రభుత్వం. అక్టోబరు 31లోగా పరీక్ష ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది న్యాయస్థానం.