కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా పలు అంశాలపై కేంద్ర వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రగతికి కేంద్రం అనేక అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.
తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. విభజన చట్టం హామీలను తుంగలో తొక్కిందన్నారు. తమ పథకాలనే కేంద్రం కాపీ కొడుతుందన్నారు.
రాష్ట్ర రుణ పరిమితిని కేంద్రం అసంబద్ధంగా తగ్గించిందన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఆంక్షలు పెడుతోందన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం పక్కకు పెట్టిందన్నారు మంత్రి హరీష్ రావు.