తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. పెట్టుబడులే లక్ష్యంగా జరిగిన 2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన విజయవంతమైందని పేర్కొన్నారు. నాలుగు రోజుల వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో 52 వాణిజ్య, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలు జరిగినట్లు వెల్లడించారు. దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ ప్రకటించారు.
సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు దావోస్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్ స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్లో తమ సపోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విషయం విదితమే.
ఫార్మా రంగానికి చెందిన యూరోఫిన్స్ సంస్థ జీనోమ్ వ్యాలీలో రూ.వెయ్యికోట్లతో అత్యాధునిక లేబొరేటరీ క్యాంపస్ను ఏర్పాటు చేస్తోందని, పెప్సికో, పీఅండ్ జీ, అల్లాక్స్, అపోలో టైర్స్ లిమిటెడ్, వెబ్ పీటీ, ఇన్ స్పైర్ బ్రాండ్స్ వంటి ఇతర ఇంటర్నేషనల్ సంస్థలు రూ.2వేల కోట్ల పెట్టుబడులు ప్రకటించినట్టు తెలిపారు. కొత్త పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు సానుకూల ఫలితాలను ఇస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు కేటీఆర్.
All thanks to my wonderful Team led ably by @jayesh_ranjan Garu 👏 https://t.co/uA6V2yY0S7
— KTR (@KTRTRS) January 21, 2023