తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. శనివారం ఆయన ట్విట్టర్ లో వేదికగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ.. ‘తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన ప్రధాని మోడీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు.. తెలంగాణ ప్రగతి అర్థం కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక వాక్సిన్ మోడీ కనిపెట్టిండు అని ఫేకుడు మాని.. పనికి వచ్చే పనులు చెయ్యండి’ అని ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయిన MLA ఎవరో చెప్పుకోండి చూద్దాం?
తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్ధం కాదు
మోడీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని… https://t.co/7JzGrxnpgw
— KTR (@KTRBRS) March 11, 2023
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం ట్వీట్ చేస్తూ.. ‘తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన “మిలియన్ మార్చ్”ను నిర్వహించి నేటికి పుష్కరకాలం గడిచింది.. ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ అనేక నిర్బంధాలను, అడ్డంకులను, అరెస్టులను అధిగమించి లక్షలాది మంది ప్రజలతో నిర్వహించిన నాటి మిలియన్ మార్చ్ నేటికీ నా కళ్ళలో మెదులుతూనే ఉందంటూ’ ట్వీట్ చేసి గుర్తు చేశారు.