తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ సంచలనమైన ట్వీట్ చేశారు. ఫేక్ సంస్థలను ప్రమోట్ చేయడాన్ని.. కరెక్ట్ కాదంటూ మరోసారి ఎండగట్టారు. గతంలోనూ ఫేక్ సంస్థలపై ఎన్నో అభ్యర్థనలు చేశారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలకు కూడా ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దని సూచించారు.
తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల జీవితాలను హెర్బల్ లైఫ్ వంటి సంస్థలు నాశనం చేస్తున్నాయని.. అలాంటి సంస్థలను స్పాన్సర్ షిప్ గా పెట్టుకోవడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. హెర్బల్ లైఫ్ లాంటి గొలుసు కట్టు సంస్థలు అమాయకపు ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాయని, ఇలాంటి మోసపూరిత సంస్థలను పార్ట్ నర్స్ గా పెట్టుకోవద్దని సూచించారు.
ఐపీఎల్ ను అడ్డం పెట్టుకొని హెర్బల్ లైఫ్ తన వస్తువులను అమ్మి బురిడీ కొట్టిస్తుందని, హెర్బల్ లైఫ్ చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. అలాంటి ఫేక్ సంస్థలపై విచారణ సంస్థలు కేసులు నమోదు చేసి, విచారణ చేయాలని కోరారు. అలాగే ఫేక్ సంస్థకు సంబంధించి ఫొటోలను సైతం షేర్ చేశారు సజ్జనార్.
‘హెర్బల్ లైఫ్ లాంటి గొలుసుకట్టు సంస్థలు అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నాయి. ఐపీఎల్ కు అఫీషియల్ పార్ట్ నర్ గా ఉన్నామని చెప్పుకొని, ప్రాడక్ట్ ల పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి. ఇలాంటి సంస్థల్ని పార్ట్ నర్స్ గా పెట్టుకోవడంపై ఐపీఎల్ యాజమాన్యం ఓసారి ఆలోచించుకోవాలి. హెర్బల్ లైఫ్ పై లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీస్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుని, మోసాలకు అడ్డుకట్ట వేయాలి’ అని ట్వీట్ చేశారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
Concerns arise over the practices of multi-level marketing companies such as Herbal Life, who are accused of deceiving unsuspecting individuals. Leveraging their association with #IPL, they promote their products extensively. IPL management should reconsider aligning with such… pic.twitter.com/28dME1M9rV
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 25, 2023