తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. భక్తులందరికి శ్రీవారి దర్శనం దక్కేలా ఆలమ ప్రవేశ టికెట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 16వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10 వేల టికెట్లను జారీ చేస్తామని తెలిపారు.
అలాగే.. ఈ నెల 16న ఉదయాస్తమాన సేవా టికెట్లను విడుదల చేస్తామనిఈవో తెలిపారు. టీటీడీ ప్రాణ దాన ట్రస్టుకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన వారికి ఈ టికెట్లను జారీ చేస్తామని వివరించారు.
ఆన్ లైన్ ద్వారా విరాళాలిచ్చిన భక్తులకు ఉదయాస్తమాన సేవా టికెట్లను జారీ చేస్తామని అన్నారు. ఈ టికెట్ల బుకింగ్ కు ప్రత్యేక పోర్టల్ జారీ చేస్తామని చెప్పారు ఈవో.