• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » 2024 ఎన్నికలకు అజెండా.. బీజేపీ రెడీ

2024 ఎన్నికలకు అజెండా.. బీజేపీ రెడీ

Last Updated: January 16, 2023 at 11:50 am

2024 ఎన్నికలే అజెండాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండు రోజులపాటు జరగనున్నాయి. సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో జరిగే ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రులు, పార్టీ అధ్యక్షుడు జేపీ. నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ, రాష్ట్ర పార్టీ శాఖల పదాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. మొత్తం సుమారు 300 మంది హాజరు కావచ్చునని భావిస్తున్నారు.

Delhi News Live: PM Modi's roadshow in Delhi today ahead of BJP's national executive meet

పార్టీ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీకాలం ఈ నెలతో ముగియవలసి ఉంది. అయితే దీన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నారు. అలాగే రాజకీయ, ఆర్ధిక, విదేశాంగ విధానాలకు సంబంధించి మూడు, నాలుగు తీర్మానాలను నేతలు ఆమోదించే అవకాశాలున్నాయి. జీ- 20 అధ్యక్ష బాధ్యతలను ఇండియా చేబట్టిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో జీ-20 ఈవెంట్ల నిర్వహణ గురించి ఈ సమావేశాల్లో చర్చించవచ్చు.

ఈ సంవత్సరంలో 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి కూడా వీటిని నిర్వహించవచ్చు.

2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ ఎన్నికలకు రోడ్ మ్యాప్ ను రూపొందించవచ్చునని తెలుస్తోంది. గత ఏడాది జులైలో హైదరాబాద్ లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాల అమలును ఈ భేటీలో సమీక్షించే అవకాశాలున్నాయి. ప్రధాని మోడీ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని పటేల్ చౌక్ నుంచి ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. దీంతో పోలీసులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

Primary Sidebar

తాజా వార్తలు

దాని పై దృష్టి పెడితే భారత్ నెం.1

ఎలాంటి విచారణ అయినా సిద్ధమే!

ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

రైట్‌ హ్యాండ్ నుంచి లెఫ్ట్‌ హ్యాండ్‌!

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూలు..మెమోలిచ్చిన ఈవో!

పార్లమెంటును తాకిన ‘అదానీ సెగ’.. మధ్యాహ్నం వరకు వాయిదా

ఇక పై చెప్పం.. మంత్రి సీరియస్ వార్నింగ్‌!

కూతురి స్నేహితురాలి మీదే కన్నేసి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

అయోధ్య రాముడి విగ్రహం కోసం నేపాల్ శాలిగ్రామ శిలలు

ఫిల్మ్ నగర్

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి... !!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి… !!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap