బంగారు ఆభరణాల కొనుగోలుదారుల్లా వచ్చి, షాపు యజమానికి షాకిచ్చారు ఇద్దరు ఆడ దొంగలు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ బస్తీ జిల్లాలోని వాల్తేర్గంజ్లో ఈ చోరీ జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం. ఇద్దరు మహిళలు నగలను కొనడానికని బంగారం షాపునకు వెళ్లారు. డిజైన్లు చూపించమని అడిగారు. దాంతో షాపు యజమాని డిజైన్లను చూపించే పనిలో ఉన్నాడు. అతని హడావుడిని అదనుగా చూసుకొని ఓ ఆడ దొంగ చెవి కమ్మలను తీసుకుని దాచింది. తర్వాత వాళ్ళిద్దరూ డిజైన్లు నచ్చలేదని వెళ్లిపోయారు.
యజమాని అన్ని సర్దుతుండగా కమ్మలు పోయాయని గుర్తించారు. తీరా సీసీటీవీ దృశ్యాలు చూస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాలు పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.